- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సునీతమ్మను చూస్తుంటే జాలేస్తోంది.. మంత్రి పొన్నం ఇంట్రెస్టింగ్ కామెంట్స్
జూబ్లీహిల్స్ (Jubilee Hills) అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీల ప్రచార పర్వం ఇప్పటికే ఊపందుకుంది.

దిశ, వెబ్డెస్క్: జూబ్లీహిల్స్ (Jubilee Hills) అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీల ప్రచార పర్వం ఇప్పటికే ఊపందుకుంది. తాజాగా బీఆర్ఎస్ (BRS) పార్టీ రహమత్ నగర్లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశం వాడివేడిగా కొనసాగింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath)ను తలుచుకుని ఆయన సతీమణి మాగంటి సునీత వేదికపైనే కన్నీటిపర్యంతమైన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు తమ కుటుంబాన్ని కడుపులో పెట్టుకుని చూసుకున్నారని ఆమె కామెంట్ చేశారు.
ఈ నేపథ్యంలోనే మాగంటి సునీత సభా వేదికపై కన్నీరు పెట్టిన విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) రియాక్ట్ అయ్యారు. తమకు ప్రత్యర్థి, మా సోదరి సునీతను చూసి తాను జాలి పడుతున్నానని అన్నారు. వేదికల మీద, రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకుని సానుభూతి పొందాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజకీల లబ్ధి కోసమే సోదరి సునీతను ఓదార్చతున్నట్లుగా కేటీఆర్ (KTR), హరీశ్రావు (Harish Rao)లు కలిసి డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. కానీ, రాజకీయాల కోసం సునీతమ్మను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని సెటైర్లు వేశారు. పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదన్నారు. ఒకవేళ అభివృద్ధే జరిగి ఉంటే.. బీఆర్ఎస్ నేతలు బహిరంగ చర్చకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సవాలు విసిరారు.
Read More: కిషన్ రెడ్డి జీ.. జూబ్లీహిల్స్ లో ఎన్ని ఓట్లతో ఓడిపోబోతున్నారు? రాజాసింగ్ హాట్ కామెట్స్






